Tuesday, May 14, 2024

బ‌స్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన‌ మంత్రి పువ్వాడ..

- Advertisement -
- Advertisement -

Puvvada ajaya kumar astonish on bus accident

పెద్దపల్లి: ప‌ర‌కాల డిపో బ‌స్సు లోయ‌లో ప‌డిన ఘ‌ట‌న‌పై ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. బెల్లంప‌ల్లి నుంచి హ‌నుమ‌కొండ వెళ్తున్న బ‌స్సు ప్ర‌మాద‌వ‌శాత్తు లోయ‌లో ప‌డ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న విచారం వెలిబుచ్చారు. గాయ‌ల‌కు గురైన బ‌స్సులోని ప్ర‌యాణీకుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందే విధంగా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్ రీజినల్ మేనేజర్లకు మంత్రి పువ్వాడ ఆదేశించారు. క్ష‌త‌గాత్రులకు కావ‌ల్సిన వైద్య సేవ‌ల కోసం సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. గాయాల‌కు గురైన ప్ర‌యాణీకులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ బాధిత కుటుంబ‌ స‌భ్యుల‌కు త‌మ విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News