Wednesday, May 8, 2024

‘రాధేశ్యామ్’ను ముగించేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న వింటేజ్ లవ్ డ్రామా ‘రాధేశ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1960ల నాటి ఇటలీ నేపథ్యంలో నడిచే ఈ కథలో విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణగా పూజా కనిపించనున్నారు. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే ఈనెల 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వచ్చి విడుదల వాయిదా పడేలా చేసింది. అయితే ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి దశకు వచ్చేసింది. ప్రభాస్, పూజా హెగ్డేలు ఈ నెల 22 నుంచి ‘రాధేశ్యామ్’ సెట్స్‌లో చేరనున్నట్లు సమాచారం. ఇద్దరు పాల్గొనే సన్నివేశాలతో ప్యాచ్ వర్క్ పూర్తవుతుందట. ఇప్పటికే ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్‌ని ఈ దెబ్బతో ముగించాలని చిత్ర బృందం ప్లాన్ రెడీ చేసింది. అలాగే సరైన టైమ్ చూసి విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని ఏరియాల్లో థియేటర్స్ పరిస్థితులు చూసి విడుదల చేయాలి కాబట్టి మేకర్స్ అన్ని విధాలుగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్, గోపీకృష్ణా మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

Radhe Shyam final schedule resume from July 22

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News