- Advertisement -
ఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 2020 సెప్టెంబర్ లో ఆర్ జెడి పార్టీకి ఆయన రాజీనామా చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఐదు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఎంఎన్ఆర్ఇజిఎ పథకం తీసుకరావడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్ జెడి పార్టీలో ఉన్నప్పుడు తేజస్వీ యాదవ్ తో రఘువంశ్ కు మంచి సంబంధాలున్నాయి. బీహార్ అసెంబ్లీలో ఎంఎల్ఎ, ఎంఎల్సీ, స్పీకర్ గా కూడా పని చేశారు. వైశాల నియోజకవర్గం నుంచి ఎంపిగా ఉండి కేంద్రమంత్రిగా పని చేశారు.
- Advertisement -