Wednesday, May 8, 2024

బ్రెజిల్‌లో బ్యాంకు దోపిడీ ముఠాపై పోలీసు కాల్పులు… 25 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బ్రెజిల్‌లో బ్యాంకు దోపిడీ ముఠాపై పోలీసు కాల్పులు
25 మంది అనుమానితుల మృతి

Raid on alleged Brazil bank robbers leaves 25 dead

బ్రెసీలియా: బ్రెజిల్‌లోని మినాస్ గెరేస్ రాష్ట్రంలో బ్యాంకు దోపిడీలు చేసేందుకు కుతంత్రాలు పన్నిన ఒక ముఠాపై ఆదివారం పోలీసులు జరిపిన కాల్పులలో 25 మంది అనుమానితులు మరణించారు. బ్రెసీలియా నగరంలోని ఆర్థిక సంస్థలపై దాడులు జరిపి దోపిడీ చేసేందుకు ఒక ముఠా పథకం వేసిందని సైనిక పోలీసులు తెలిపారు. ఫెడరల్ హైవే పోలీసులతో కలిపి ఆ ముఠాపై జరిపిన దాడిలో 50 మిషన్ గన్స్, రైఫిల్స్, పేలుడు పదార్థాలు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు తదితర భారీ ఆయుధ సామగ్రి లభించిందని పోలీసులు తెలిపారు. బ్రెజిల్‌లో బ్యాంకు దోపిడీలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కొన్ని సందర్భాలలో మనుషులను కిడ్నాప్ చేసి వారిని కవచంగా వాడుకుని దోపిడీలకు, వసూళ్లకు కొన్ని నేర ముఠాలు పాల్పడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News