Thursday, May 16, 2024

ఈ సారి వర్షాలు తక్కువే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ ఏడాది దేశంలో వర్షాలు తక్కువే అని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. తక్కువ వర్షపాతం కారణంగా కరువు కాటకాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎల్‌నినో కారణంగా వేడి అధికంగా ఉంటుందని తెలిపిం ది. ఈ ప్రభావం దక్షిణ భారతంలో కంటే ఉత్తర భారతం లో అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. కరువు పరిస్థితులు ఏర్పడేందుకు 20శాతం అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ట్రిపుల్ డిప్‌లా నినా భూమధ్య రేఖ వెంబడి ఫసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలంపై సంవత్సరాల పాటు చుట్టబడటం, ఇది కరువులు, విపరీతమైన గాలులు, భారీ వర్షాలకు కారణం అవుతుందని వివరించింది.

నైరుతి రుతుపవనాల వల్ల గత నాలుగు సీజన్లలో సాధారణ లేదా, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని స్కైమెట్ మేనేజింగ్ డైరెక్టర్ జతిన్ సింగ్ తెలిపారు. ఇప్పడు లా నినా ముగిసిందని, ఎల్ నినా ప్రభావం ఎక్కువైందని తెలిపారు. ఈ విధంగా ఎల్ నినా ప్రభావం పెరిగిపోతే రుతుపవణాలు బలహీనపడి తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. వర్షపాతం తగ్గడానికి ఇండియన్ ఓషియన్ డైపోల్ (ఐఒడి) మరో కారణం అని పేర్కొన్నారు. దీన్ని ఇండియన్ నినో అనికూడా పిలుస్తారని తెలిపారు. దీనివల్ల వర్షాకాలంలో నెలవారీ వర్షపాతంలో వైరుధ్యం ఏర్పడుతుందని స్కైమె ట్ పేర్కొంది. దీని కారణంగా ఉత్తరాదిలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది.

జులై, ఆగస్ట్ నెల ల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో సాధారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పంజాబ్ ,హర్యాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సీజన్ రెండ వ భాగంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భూమధ్య రేఖ వెంబడి ఫసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలంపై అసాధారణ వేడి, చల్లదనం లాంటివి నమోదవుతాయి. ఇలాంటి పరిణామాలను ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ సిస్టమ్‌గా తెలిపిం ది. ఈ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతను , వర్షపాతాలను ప్రభావితం చేస్తాయి.
ఇందులో ఈఎన్‌ఎస్ న్యూట్రల్, ఎల్‌నినో, లానినోగా మూడు దశలు ఉం టాయి. న్యూట్రల్ ఫేజ్‌లో ఫసిఫిక్ మహాసముద్రం ఉపరితలం మీదుగా తూర్పు నుంచి పడమరకు గాలులు వీస్తా యి.
అలా వెచ్చని తేమను పశ్చిమానికి తీసుకువస్తాయి. దీంతో మధ్య ఫసిఫిక్ ప్రాంతం చల్లగా ఉంటుంది. ఎల్‌నినో వల్ల మధ్యతూర్పు పసిఫిక్ సముద్రంపైన ఉపరితల గాలి ఒత్తిడి పడిపోతుంది. హిందూ మహాసముద్రంపై ఉపరితల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో భారతదేశంలోకి వీచే నైరుతి రుతుపవనాలు పెరూ దేశం తీరంవైపు ప్రయాణిస్తాయి. దీంతో భారత్‌లో వర్షపాతం తగ్గుతుంది. ఇక లానినో దీనికి పూర్తిగా విరుద్దం. ఇండియా వైపు అధిక రుతుపవనాలు వీచి భారీ వర్షాలు కురుస్తాయని స్కైమెట్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News