- Advertisement -
హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఎపిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో మత్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని.. దక్షిణకోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. తెలంగాణలోనూ తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Rains in Telangana and AP for next 4 days
- Advertisement -