అబుదాబి: వరుస విజయాలతో ప్రకంపనలు సృష్టిస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా ఐదు విజయాలు సాధించి పంజాబ్ ఈసారి కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్థానంలో ఉండగా రాజస్థాన్ ఏడో స్థానంలో నిలిచింది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తన చివరి రెండు మ్యాచ్ల్లో రాజస్థాన్ గెలవాల్సి ఉంది. రాజస్థాన్కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలవక తప్పదు. పంజాబ్తో పోరులో రాజస్థాన్ ఓడితే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్ బెర్త్ను దక్కించుకోవాలని భావిస్తోంది.