Sunday, May 12, 2024

రాజేంద్రనగర్ ప్రజలు ఆందోళన చెందవద్దు: రంజిత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Rajendra nagar people dont tension for Leopard

 

రంగారెడ్డి: రాజేంద్రనగర్ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఎంపి రంజిత్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజేంద్రనగర్ పరిధిలో చిరుత సంచరిస్తుందని తెలియడంతో చిరుత కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని ఎంపి రంజిత్ రెడ్డి తెలిపారు. చిరుతను పట్టుకోవడానికి చేస్తున్న ఏర్పాట్లను గురించి జూపార్క్ డిప్యూటీ డైరెక్టర్ హకీమ్‌ను అడిగి తెలుసుకున్నారన్నారు. చిరుత కోసం ఏర్పాటు చేసిన సిసి కెమెరాల గురించి డిసిపి ప్రకాశ్ రెడ్డితో ఎంపి రంజిత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ శివారు కాటేదాన్‌లో నడిరోడ్డుపై చిరుత కనిపించడంతో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.  చిరుత పులిని పట్టుకోవడానికి 20 ప్రాంతాల్లో నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్‌లతో పోలీసులు నిఘా వేశారు. అటు పోలీసులు, ఇటు అటవీ శాఖ సిబ్బందికి చిరుత ముచ్చెమటలు పట్టిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News