Sunday, May 5, 2024

డ్రగ్స్ కథా చిత్రమ్

- Advertisement -
- Advertisement -

Rakul Preet Singh in Bollywood Drug Case

 

టాలీవుడ్‌కు బాలీవుడ్ ప్రకంపనలు

తెరపైకి తెలుగు చిత్రసీమలోని ప్రముఖుల పేర్లు
హీరోయిన్ రకుల్‌ప్రీత్ సహా 10 మందిపై ఆరోపణలు
టాలీవుడ్‌పై ఎన్‌సిబి నిఘా
పాత నిందితుల విచారణకు సన్నాహాలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి ఎన్‌సిబి విచారణలో డ్రగ్స్ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేయడంతో బాలీవుడ్ ప్రకంపనలు మొదలయ్యాయి. ఈక్రమంలో డ్రగ్స్ లింకుల వ్యవహారం క్రమంగా టాలీవుడ్‌కూ విస్తరిచడంతో పాటు తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖలు పేర్లు తెరపైకి వచ్చాయి. రియా చక్రవర్తి నిత్యం డ్రగ్స్ తీసుకునే 25 మంది పేర్లను వెల్లడించగా అందులో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి ర కుల్ ప్రీత్‌సింగ్ పేరు తెరపైకి వచ్చింది. రియా తన స్నేహితురాలు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లను వెల్లడించడం సంచలనంగా మారింది. రకుల్‌తో పాటు మరో 10 మంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉ న్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కా గా ఈ విషయంపై హీరో నవదీప్ సైతం స్పం దించారు.

డ్రగ్స్ వ్యవహారంతో తమకు సంబంధంలేదని తేల్చిచెప్పాడు. 2017 లో డ్రగ్స్ కేసులో 15 మంది టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిట్ అధికారులు దర్శకుడు పూరీ జగన్నాథ్,నటులు రవి తేజ, ఛార్మి, తరుణ్, నవదీప్, ముమైత్ ఖాన్, సుబ్బరాజు,తనీష్ లతో పాటు మరికొందరిని విచారించారు. అందరి రక్తం, వెంట్రుకల నమూనాలు తీసుకుని వాటిని పరీక్షలకు పంపారు. అనుమానితుల్లో చాలా మంది డ్రగ్స్ వాడినట్లు అధికారులు గుర్తించారు. ఛార్జ్ షీట్ లో కూడా సిట్ ఈ విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఆ తర్వాత ఆ కేసు క్రమంగా మందగమనంలోకి వెళ్లిపోయింది. ఇప్పటికీ టాలీవుడ్ లో చాలా మంది డ్రగ్స్ వాడుతున్నారని చర్చ జోరుగా సాగుతూనే ఉంది. పలువురు ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నట్లు ఇప్పటికే పోలీసులు, ఎక్సైజ్ అధికారుల విచారణలో వెల్లడైంది. కాగా తాజాగా రియా చేసిన సంచలన వ్యాఖ్యలతో మరోసారి డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది.

టాలీవుడ్‌పై ఎన్‌సిబి నిఘా
డ్రగ్స్ వ్యవహారంలో రియా చేసిన వ్యాఖ్యలతో నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో పాత నిందితులను విచారించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈక్రమంలో రకుల్‌ప్రీత్ సింగ్ పేరు తాజాగా తెరపైకి రావడంతో శనివారం వికారాబాద్ శివారులో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న హుటాహుటిన షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆమెపై వస్తున్న ఆరోపణలను రకుల్ మేనేజర్ తీవ్రంగా ఖండిస్తున్నారు. తనపై కుట్రతో ఇదంతా చేస్తున్నారని వాదిస్తున్నారు. కాగా రియా వెల్లడించిన 25 మందికి నోటీసులు జారీచేసే ప్రక్రియ ఓ వైపు జరుగుతుండగా.. మరోవైపు టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో శనివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైంది. డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదర్కొంటున్న వారికి నోటీసులు పంపిన అనంతరం జరిగే పరిణామాలపై వారు చర్చించారు. కాగా బాలీవుడ్‌లో రియా అరెస్ట్‌తో మొదలైన పర్వం బెంగళూరులో బుజ్జిగాడు బ్యూటీ సంజనా వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరికొంత మందిని ఎన్‌సిబి అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

టాలీవుడ్‌లో బానిసలున్నారు
టాలీవుడ్‌లో డ్రగ్స్‌మత్తుకు బానిసలైన వారున్నారని మాజీ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మీడియాతో పేరొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్‌లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ లింక్స్ ఉంటాయన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో దర్యాప్తులో డ్రగ్స్‌కు బానిసలైన ఎంతోమంది నటులను చూశానన్నారు. నటులు గ్లామర్ కాపాడుకోవాలంటే డ్రగ్స్ వాడక తప్పదని విచారణలో తనతో చెప్పారని వెల్లడించారు. గ్లామర్ కోసం చాలా మంది ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నారు. ఎన్‌సిబి చట్టం ప్రకారం డ్రగ్స్ వినియోగ దారులు సైతం శిక్షార్హులే నని మాజీ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ వివరించారు.
– మాజీ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్

Rakul Preet Singh in Bollywood Drug Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News