మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. మెగా హీరోలు రామ్చరణ్, వరుణ్తేజ్లకు కరోనా సోకింది. మంగళవారం ఉదయం రామ్చరణ్ తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించాడు. కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని.. తనకు ఎటువంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉంటున్నానని చెప్పాడు. కరోనా నుంచి కోలుకొని త్వరగా బయటకు వస్తానంటూ రామ్చరణ్ ఒక ప్రకటన విడుదల చేశాడు. అలాగే గత రెండు రోజుల్లో తనను కలిసిన వారందరిని టెస్ట్ చేయిచుకోవాల్సిందిగా చరణ్ కోరాడు. ఈ క్రమంలో మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తాను కరోనా బారిన పడినట్లు వెల్లడించాడు. మంగళవారం వరుణ్ తేజ్ ట్వీట్ చేస్తూ “కోవిడ్ -19 టెస్టులో తేలికపాటి లక్షణాలతో నాకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నేను త్వరలోనే తిరిగి వస్తాను” అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల కరోనా బారిన పడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కోలుకుంది. తాజాగా చేయించుకున్న పరీక్షలో ఆమెకు కరోనా నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని రకుల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. “తాజాగా చేయించుకున్న పరీక్షలో నాకు కరోనా నెగటివ్ వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నా. ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నా”అని రకుల్ పేర్కొంది.
Rakul Preet Singh tests negative for Covid-19