- Advertisement -
ముంబయి: సోషల్ మీడియాలో ఒక్క క్లిక్తో ప్రపంచమంతా ఫేక్ న్యూస్ ప్రచారం అవుతూనే ఉంటుంది. రియల్ వార్త కంటే ఫేక్ న్యూస్ నే ఎక్కువగా నెటిజన్స్ షేర్ చేయడంతో పాటు లైక్ చేస్తున్నారు. అది ఫేక్ న్యూస్ అని తెలియగానే సోషల్ మీడియాలో ఏ వార్తను షేర్ చేయాలో అర్థం కావడం లేదని నెటిజన్ వాపోతున్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ముంబయిలోని బాంద్రాలోని ఓ మెడికల్ షాపులో మెడిసిన్ తీసుకొని తన కారు దగ్గరకు వస్తుండగా కొందరు వీడియో తీశారు. రకుల్ వైన్ షాపు మందు బాటిళ్లు తీసుకొని వెళ్తోందని ఫేక్ ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తప్పుడు ప్రచారం చేసినందుకు రకుల్ ప్రీతి అభిమానులు మండిపడుతున్నారు.
- Advertisement -