అమరావతి: విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య పదికి చేరింది. వివిధ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. సీరియస్ గా ఉన్నవారిని కెజిహెచ్ కు తరలించారు. ఎపి సిఎం జగన్ విశాఖకు చేరుకున్నారు. కాసేపట్లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ప్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ సాధారణ పరిస్థితికి వచ్చిందని, ఈ ప్రమాదంలో కంపెనీ ఉద్యోగులు ఎవరూ చనిపోలేదని మంత్రి గౌతం రెడ్డి తెలిపారు. వందల మంది అస్వస్థతకు గురైన 5 ఊళ్లను అధికారులు ఖాళీ చేయించామన్నారు. బాధితులను గోపాలపట్నం, పెందుర్తి రైల్వే స్టేషన్, సింహాచలం దేవస్థానం సత్రాల్లో ఉంచామని మంత్రి గౌతం రెడ్డి తెలిపారు.
Death toll rises to ten in Visakha gas leak accident
#NDRF special chemical accident team carries out rescue operations in #Vizag … #VizagGasLeak pic.twitter.com/aQE3mirUqr
— Supriya Bhardwaj (@Supriya23bh) May 7, 2020