Saturday, April 27, 2024

తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారు వదిలి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సును లారీ ఢీకొట్టడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News