Friday, April 26, 2024

బాలికపై అత్యాచారం… చెట్టుకు ఉరేసి…

- Advertisement -
- Advertisement -

Rape on girl after hanged in Madhya Pradesh

భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిషాలో దారుణం జరిగింది. ఓ బాలికపై (12) అత్యాచారం చేసి అనంతరం ఆమె చెట్టుకు ఉరేసి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ తల్లి తన కూతురుతో కలిసి పొలం పనులకు వెళ్లింది. ఇంటికి వచ్చేటప్పుడు తల్లి ముందు నడుస్తుండగా బాలిక వెనక నడుస్తోంది. ఇంటికి వచ్చిన తరువాత కూతురు కనిపించకపోవడంతో వెంటనే పొలానికి సమీపంలో వెతకారు. గ్రామస్థులు అందరూ వెతకగా ఓ చెట్టుకు బాలిక వేలాడుతూ కనిపించింది. ఆమె చేతులు కట్టేసి ఉరి తీసినట్టుగా ఉంది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News