లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్లో దారుణం జరిగింది. అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. గౌరవ్ శర్మ అనే వ్యక్తి తన గ్రామంలో ఉండే యువతిని వేధించడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి 2018లో గౌరవ్ శర్మను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గౌరవ్ శర్మ ఈ మధ్యన బెయిల్ పై విడుదలయ్యాడు. గౌరవ్ శర్మ భార్య, అత్త, దేవాలయానికి వెళ్లినప్పుడు, అత్యాచార బాధితురాలి తండ్రి, ఆమె, సోదరి దేవాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ పెద్దదిగా మారడంతో గౌరవ శర్మ గన్ తీసుకొని వారిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాధితుడు చనిపోవడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ విచారణకు ఆదేశించారు.
రేప్ బాధితురాలి తండ్రిని కాల్చి చంపారు…..
- Advertisement -
- Advertisement -
- Advertisement -