- Advertisement -
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘అతిలోకసుందరి’ దివంగత శ్రీదేవి బయోపిక్లో నటించాలని ఆరాటపడుతోంది. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా వెల్లడించింది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈ లక్కీ బ్యూటీ తన మనసులోని మాటను బయట పెట్టింది. శ్రీదేవి బయోపిక్, – సౌందర్య బయోపిక్.. వీటిలో నేను దేంట్లో నటిస్తే బాగుంటుంది? అని ఈ చిట్ చాట్లో తన అభిమానులను ఆమె అడిగింది. రష్మిక ఫ్యాన్స్ అందరూ శ్రీదేవి బయోపిక్లో నటిస్తే బాగుంటుందని ఆమెకు సమాధానం ఇచ్చారు. దీనికి రష్మిక సైతం సంతోషపడి నేను కూడా అదే అనుకున్నానంటూ వారికి బదులిచ్చింది. కాగా మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి అలరించిన శ్రీదేవి బయోపిక్ ను రూపొందించడానికి సన్నాహకాలు జరుగుతున్నాయని ఈ మధ్య వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి బయోపిక్ కోసం ఆమె భర్త బోనీ కపూర్ ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నారట.
- Advertisement -