- Advertisement -
అందమైన ఎన్నో చిత్రాలను తన కుంచెతో ప్రాణం పోసిన గొప్ప చిత్రకారుడు రవివర్మ. ఆయన చిత్రాలపై అప్పట్లో ఎందరో కవులు ఎన్నోన్నో కవిత్వాలు వల్లె వేశారు. అయితే జీవం పోసినట్లుండే ఆ రవివర్మ గీసిన చిత్రం నిజంగానే జీవంతో తిరిగొస్తే, ఎలా ఉంటుంది..? అదొక అద్భుతమని చెప్పొచ్చు. ప్రముఖ ఫోటో గ్రాఫర్, విజువల్ ఆర్టిస్ట్ వెంకట్ రామ్ తన కెమెరా మాయాజాలంతో రవివర్మ కుంచెతో గీసిన చిత్రాలకు జీవం పోశాడు. అందాల తారలు సమంత, శృతిహాసన్, ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ తదితర ముద్దుగుమ్మలను అచ్చు రవివర్మ చిత్రాలను తలపించేలా ముస్తాబు చేసి ఫోటో షూట్ చేశాడు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిజంగానే రవివర్మ గీసిన చిత్రాలు ప్రాణం పోసుకుని భువిపైకి వచ్చాయా..! అని ఆశ్చర్యపోయేంతలా ఈ ఫోటోలు ఉండడం విశేషం.
Ravi Varma brought to life the images
- Advertisement -