Wednesday, May 1, 2024

అభ్యర్థుల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలి: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎంఎల్‌సికి నామినేషన్ వేసిన అభ్యర్థులు వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడం అధికారుల వైఫల్యమేనని అన్నారు. అఫిడవిట్‌లో పూర్తి వివరాలను పొందుపర్చలేదన్న తమ నమ్మకం బలపడిందని తెలిపారు. మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డిపై ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వెంకటరామిరెడ్డి రాజీనామాను తిరస్కరించాలని ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. వెంకటరామిరెడ్డి నామినేషన్ ఆమోదిస్తే కోర్టు, కేంద్రం ముందు నిలబెడతామని రేవంత్ అన్నారు.

Revanth Reddy fires on Venkatarami Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News