Monday, April 29, 2024

సబ్‌ఇంజినీర్‌ను విడిచిపెట్టిన నక్సల్స్

- Advertisement -
- Advertisement -

Naxals free Chhattisgarh govt sub-engineer in Bijapur

బీజాపూర్: చత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల వద్ద బందీగా ఉన్న సబ్ ఇంజినీర్‌ను బుధవారం విడిచిపెట్టారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. బీజాపూర్ జిల్లాలో ఈ నెల11న సబ్ ఇంజినీర్ రోషన్‌లక్రా(35)తోపాటు ఆయన సహాయకుడు లక్ష్మణ్ పార్తగిరి (24)ని నక్సలైట్లు అపహరించారు. ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన కింద చేపట్టిన రహదారి నిర్మాణ పనుల పర్యవేక్షణకు వెళ్లిన సందర్భంగా వారిద్దరినీ నక్సలైట్లు ఎత్తుకెళ్లారు. రెండు రోజుల తర్వాత లక్ష్మణ్‌ను విడుదల చేశారు. ఇప్పుడు రోషన్‌ను గంగ్లూర్ రోడ్డుపై విడిచి వెళ్లారని పోలీస్ అధికారి తెలిపారు. రోషన్‌ను నక్సలైట్లు హింసించారా..? లేదా..? అన్నది వైద్య పరీక్షల్లో తేలుతుందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News