Friday, April 26, 2024

కెసిఆర్‌కు రేవంత్ లేఖ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్‌కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, బడ్జెట్ లో నిధుల కేటాయింపు గురించి ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని, గడిచిన నాలుగేళ్లలో రెండు విడతల్లో కలిపి మొత్తం మాఫీ చేసింది కేవలం రూ.3,881 కోట్లు మాత్రమేనన్నారు. ఇంకా రూ.20,857 కోట్లు మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేశారన్నారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాలు భూమి వరకు ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చలేదని వెల్లడించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చినట్లు కనిపిస్తోందని, రూ.35,200 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.60 వేల కోట్లకు చేరిందన్నారు. గత బడ్జెట్ లో చేసిన కేటాయింపులు కేవలం రూ.1,225 కోట్లు మాత్రమేనని, ఇలా కేటాయింపులు చేస్తే ఈ ప్రాజెక్టు మరో 6070 ఏళ్లకు కూడా పూర్తి కాదన్నారు.డబుల్ బెడ్ రూం ఇళ్లపై గడిచిన తొమ్మిదేళ్లుగా మీరు ప్రజలను ఊరిస్తూనే ఉన్నారన్నారు. తొమ్మిదేళ్లలో మీరు మంజూరు చేసిన ఇళ్లు కేవలం 2,97,057 మాత్రమేనని, ఇందులో 2,28,520 నిర్మాణం మొదలవగా, లబ్ధిదారులకు అందజేసినవి కేవలం 21 వేలు మాత్రమేనని, సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్న హామీ ఏమైందన్నారు.

గత బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకానికి ఇంత వరకు మార్గదర్శకాలు లేవు, పథకం ప్రారంభించింది లేదన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3016 నిరుద్యోగ భృతి ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో టిఎస్‌పిఎస్‌సి వద్ద సుమారు 26 లక్షల మంది నిరుద్యోగుల నమోదు జాబితా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎవరికీ ఒక్క రూపాయి భృతి ఇచ్చింది లేదని, పేద విద్యార్థుల కోసం కాంగ్రెస్ హాయంలో తెచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అటకెక్కించారని ఆయన మండిపడ్డారు.

రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామన్న మీ హామీ ఒక బూటకమని, పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలతో రైతులు రోడ్డెక్కుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో మళ్లీ సబ్ స్టేషన్ల ముందు ధర్నాల దృశ్యాలు కనిపిస్తున్నాయని, నష్టాల భర్తీ పేరుతో గృహ వినియోగదారులపై ఎసిడి పేరుతో అదనపు చార్జీల భారం మోపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, కొత్త వాటి సంగతి దేవుడెరుగు, ఉన్న ఆస్పత్రులు నిర్వహణకే నిధులు లేని పరిస్థితి ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News