Thursday, May 9, 2024

72ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్..

- Advertisement -
- Advertisement -

Rishab Pant hits highest runs in England

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత యువ ఆటగాడు రిషబ్ పంత్ మూడు రికార్డులను తిరగరాశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో(146, 57) కలిపి మొత్తం 203 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో విండీస్ ఆటగాడు క్లైడ్ వాల్‌కాట్ పేరిట ఉన్న 72 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అంతేగాక బర్మింగ్‌హామ్‌లో ధోనీ పేరిట ఉన్న 151 రికార్డును కూడా పంత్ తిరగరాశాడు. అంతేగాక ఇంగ్లండ్‌లో ఓ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ, అర్ధ సెంచరీ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా కూడా పంత్ రికార్డు నెలకొల్పాడు.

Rishab Pant hits highest runs in England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News