Friday, May 10, 2024

నడిరోడ్డుపై చేతిని నరికేసి… రూ.1500 లాక్కెళ్లిపోయారు…

- Advertisement -
- Advertisement -

 

ఛండీగఢ్: ఇద్దరు బైక్‌పై వచ్చి ఓ వ్యక్తి చేతిని నరికి అతడి దగ్గర ఉన్న టాబ్లెట్లు, 1500 రూపాయల నగదుతో పారిపోయిన సంఘటన పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ ప్రాంతం నౌషేరా గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నౌషేరా నంగ్లీ గ్రామానికి చెందిన ప్లాత్ విశ్వాస్ అనే వ్యక్తి ఓ గ్రామం నుంచి సొంతూరుకు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో రోడ్డు పక్కన కూర్చున్నాడు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అతడి దగ్గరికి వచ్చి విశ్వాస్ చేతిని నరికేసిన అనంతరం అతడి వద్ద ఉన్న 1500 డబ్బులు, టాబ్లెట్లు తీసుకొని పారిపోయారు. రక్తపు మడగులో ఉన్న విశ్వాస్‌ను వాహనదారులు గుర్తించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఊడిపోయిన చేతి భాగాన్ని వైద్యులు అతికించారు. అతడి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారి యద్వేందర్ సింగ్ తెలిపారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News