- Advertisement -
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ పర్యటనలో భారీగా ఫ్లెక్సీలు కట్టిన ఇల్లెందు మున్సిపల్ చైర్మన్కు, ఖమ్మం నగరంలోని కార్పొరేటర్కు రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. నగర టిఆర్ఎస్ అధ్యక్షుడు, 16వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళీకి రూ.లక్ష చొ ప్పున జరిమానా విధించారు. అదేవిధంగా ఇల్లెందు పట్టణంలో మంత్రి కెటిఆర్ పర్యటన సందర్భంగా అక్కడి మున్సిపల్ చైర్మన్ డి వెంకటేశ్వర్రావు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిని గమనించిన మంత్రి కెటిఆర్ చైర్మన్కు రూ.లక్ష జరిమాన విధించాలని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ఈ జరిమానా విధించారు.
Rs.1 lakh penalty to Khammam Corporator
- Advertisement -