Monday, April 29, 2024

ప్రైవేట్ బస్సులో రూ. 2 కోట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Rs. 2 crore seized in Private bus at Vizianagaram

అమరావతి: పోలీసుల తనిఖీల్లో విజయనగరం-గుంటూరు రోడ్డులో ప్రయాణిస్తున్న పద్మావతి ట్రావెల్స్ బస్సులో శుక్రవారం నగదు లభ్యమైంది. ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న రూ.2 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బస్సు డ్రైవర్, క్లీనర్ ను అదుపులో తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బస్సు సీట్ల కింద లగేజ్ క్యారియర్ లో తరలిస్తుండగా నగదు పట్టుబడిందని అధికారులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పట్టుబడిన నోట్లు నకిలీవా, నిజమైనవా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News