Saturday, April 27, 2024

కొత్త సంవత్సరం కానుక.. రైతుల ఖాతాల్లోకి రూ.20,900కోట్లు..

- Advertisement -
- Advertisement -

Rs 20900 Cr released under PM KISAN Scheme

కొత్త సంవత్సరం కానుకగా పిఎం కిసాన్ నిధులు విడుదల
రైతుల ఖాతాల్లోకి రూ.20,900కోట్లు
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త లక్ష్యాలు
సేంద్రీయ పంటల సాగువైపు మళ్లాలి
వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఆధిక డిమాండ్
– ప్రధామంత్రి నరేంద్ర మోడి
మనతెలంగాణ/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతన సంత్సరం కానుకగా శనివారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద విడుదల చేసింది. వ్యవసాయ రంగంలో ప్రతిఏటా పెట్టుబడి సాయంగా ఈ పథకం ద్వారా అందజేసే నిధుల్లో భాగంగా రూ.20,900కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు కేంద్రం జమ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడి పిఎం కిసాన్ 10వ విడత కింద వర్చువల్ విధానం ద్వారా ఈ నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 10.09కోట్ల మంది రైతులకు ఈ నిధుల ద్వారా లబ్ది చేకూరనుంది. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్రమోడి పలువురు రైతులతో మాట్లాడారు. ఎగుమతుల్లో ప్రత్యేకించి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. అందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం మన ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు 8శాతానికిపైగా ఉందన్నారు. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయన్నారు. జిఎస్‌టి రాబడిలో గత రికార్డులు బద్దలవుతున్నాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త లక్ష్యాలు నిర్ధేశించుకున్నామన్నారు. 2021లో కేవలం యూపిఐ ద్వారానే రూ.70వేలకోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్టు తెలిపారు.

ఇప్పడు 50వేలకు పైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. అందులో గత 6 నెలల్లోనే 10వేల అంకురాలు నమోదయ్యాయని తెలిపారు. పర్యావరణ మార్పులపై ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నామన్నారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తొలగించాలనేది లక్షంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. అదే విధంగా విద్యుత్ వాహనాలకోసం కృషి చేస్తున్నామని తెలిపారు. 2021లో అమ్మాయిల వివాహ వయస్సు 18నుంచి 21ఏళ్లకు పెంచామన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పిఎం గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక ఒక రూపు తీసుకురానుందన్నారు. మేక్‌ఇన్ ఇండియాకు కొత్త మార్గాలు చూపుతూ చిప్ , సెమి కండక్టర్ల తయారీ కోసం ప్రత్యేక పథకాలు తీసుకోచ్చామన్నారు. ముందు జాగ్రత్త అప్రమత్తతతో కోవిడ్ 19పై దేశం పోరాటం చేస్తుందన్నారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుతామన్నారు. ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో 2021లో సాధించిన విజయాలను ప్రధాని ప్రజలకు వివరించారు. దేశంలో రూ.145కోట్ల కరోనా టీకా డోసులు అందించినట్లు తెలిపారు. కరోనా వైరస్ పలు సవాళ్లను ఇచ్చిందన్నారు. కాని దేశ అబివృద్ధిని అడ్డుకోలేదన్నారు. కరోనా సయయంలో దేశంలోని 80కోట్ల మంది లబ్దిదారులకు రూ.2.6లక్షల కోట్ల విలువైన ఆహారధాన్యాలను ఉచితంగా అందించినట్లు తెలిపారు. రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళాలని సూచించారు. అటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని ప్రధాని మోడి రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు ,వ్యవసాయశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎఫ్‌పిఒలకు ఈక్విటి గ్రాంట్స్ విడుదల:
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ప్రతియేటా పెట్టుబడి సాయంగా కేంద్రం రూ.6వేలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో 2వేల చొప్పున విడుదల చేస్తూవస్తోంది. ప్రస్తుతం 10వ విడుతగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. అలాగే దేశంలోని 351 ప్రార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఒ)లకు ప్రధాని మోడి రూ.14కోట్లు ఈక్కిటి గ్రాంట్స్ విడుదల చేశారు. దీనిద్వారా 1.24లక్షల మంది రైతులు లబ్ది పోందనున్నారు.

Rs 20900 Cr released under PM KISAN Scheme

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News