Friday, May 17, 2024

కోహ్లి సేనకు ఊరట

- Advertisement -
- Advertisement -

RT PCR tests are negative for team india cricketers

లండన్: ఇంగ్లండ్ సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. భారత క్రికెటర్లకు నిర్వహించిన ఆర్‌టిపిసిఆర్ పరీక్షల్లో అందరికి నెగెటివ్ వచ్చిందని సమాచారం. ఇప్పటికే కరోనా బారిన పడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో సన్నిహితంగా మెలిగిన వారందరికీ నెగెటివ్ రావడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఇక వార్మప్ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు డర్హమ్ చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక పరీక్షల్లో అందరికీ నెగెటివ్ రావడంతో టీమిండియాకు పెద్ద ఊరట లభించింది. ఇదిలావుండగా వృద్ధిమాన్ సాహా, ఈశ్వరన్, భరత్ అరుణ్‌లు ప్రస్తుతం లండన్‌లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. పంత్ కూడా వారితోనే ఉన్నాడు. వారం రోజుల తర్వాత వారికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అందులో నెగెటివ్ వస్తేనే జట్టుతో కలిసే అవకాశం ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News