Sunday, April 28, 2024

అహోబిలం లోయలో పడిన ఆర్టీసీ బస్సు

- Advertisement -
- Advertisement -
RTC bus crashes in Ahobilam valley
పది మంది ప్రయాణికులకు గాయాలు

హైదరాబాద్ : కర్నూలు జిల్లా ఎగువ అహోబిలం అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలానికి వచ్చేందుకు బస్సును తిప్పుతున్న క్రమంలో అది అదుపు తప్పి లోయలో పడింది. క్షతగాత్రులను 108 వాహనంలో ఆళ్లగడ్డ తరలించారు. గాయపడిన వారిలో డ్రైవర్ కమాల్‌బాష, మైదుకూరుకు చెందిన ఓబులేశు, ధర్మవరంకు చెందిన వెంకటలక్ష్మమ్మతో పాటు మరికొందరు ఉన్నారు. వీరిలో వెంకటలక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు,ఆలయ అధికారి నర్సయ్య ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News