రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి ప్రపంచ క్రికెట్లోనే పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ధోనీ కెరీర్కు సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో ధోనీ ఎవరికి అంచనాలకు అందని విధంగా ఆటకు వీడ్కోలు ప్రకటిస్తున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ధోనీ ఆకస్మిన నిర్ణయం నుంచి ఇప్పటికీ అతని అభిమానులు, టీమిండియా క్రికెటర్లు కోలుకోలేక పోతున్నారు. మరి కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని అందరూ భావిస్తున్న సమయంలో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి అందరి ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక ధోనీ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడం అతని సహచరులకు, అభిమానులకు, కుటుంబ సభ్యులకు కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ధోనీ సతిమణి సాక్షి ధోనీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
దేశం గర్వపడేలా ధోనీ ఎన్నో విజయాలను అందించాడని, ప్రజలు వాటిని మర్చిపోతారు కాని ఆ క్షణంలో అతను అందించిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరని వ్యాఖ్యానించింది. మీరు సాధించిన విజయాలను, రికార్డులను చూసి గర్వపడాలి. ఆటకు వీడ్కోలు పలికినందుకు అభినందనలు. మీరు సాధించిన విజయాలను చూసి భార్యగా నేను ఎంతో గర్విస్తున్నాను. మీ కిష్టమైన ఆటకు వీడ్కోలు పలికే సమయంలో మీరు పడిన మనోవేదనను నేను అర్థం చేసుకోగలను అని సాక్షి ఆ పోస్ట్లో పేర్కొంది. కన్నీళ్లను దిగమించుకుని రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారని అనుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు చెప్పిన మాటలు, చేసిన సేవలను ఎవరూ మరచి పోరని తాను భావిస్తున్నానని తెలిపింది. ఒక వేళ అభిమానులు, ప్రజలు మీరు అందించిన సేవలను మరచి పోయినా భార్యగా తాను మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటానని సాక్షి వ్యాఖ్యానించింది.
Sakshi Emotional tweet on Dhoni’s Retirement