Saturday, May 4, 2024

‘గుడికి వచ్చి.. బుద్ధి ఉందా?’: రిపోర్టర్ పై సమంత ఆగ్రహం (వీడియో)

- Advertisement -
- Advertisement -

Samantha lashes out Reporter asks relation with Chaitanya

హైదరాబాద్: అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోయారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నా.. దీనిపై అటు నాగ చైతన్య కానీ, ఇటు సమంత కానీ ఇద్దరూ పెదవి విప్పడంలేదు. దీంతో వీరిద్దరూ తమ వివాహ బంధానికి ముగింపు పలికి విడిగా ఉంటున్నారనే వార్తాలు మరింతగా నెట్టంట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో నాగ చైతన్యతో రిలేషన్ గురించిన అడిగిన ఓ రిపోర్టర్ పై సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. గత శనివారం సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బయటికి వస్తున్న సమంతను ఓ రిపోర్టర్.. ”నాగ చైతన్యతో వీడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.. దీనిపై మీ సమాధానం” అని అడిగాడు. దీంతో ‘గుడికి వచ్చి.. బుద్ధి ఉందా?’ అని రిపోర్టర్ పై సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సమంత సమాధానంతో నాగ చైతన్యతో విడిపోయినట్లు వస్తున్న రూమర్స్ నిజమే కావొచ్చునని అందరూ భావిస్తున్నారు. చూడాలి మరి దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతోందో.

Samantha lashes out Reporter asks relation with Chaitanya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News