Friday, April 26, 2024

ఆయన ఎక్కడికి పారిపోలేదు: పరమ్ బీర్ సింగ్ లాయర్

- Advertisement -
- Advertisement -

Param Bir Singh

ముంబయి: “పరమ్ బీర్ సింగ్ ఎక్కడికి పారిపోలేదు, ఇండియాలోనే ఉన్నాడు”అని అతడి లాయర్ ధృవీకరించిన కొన్ని రోజులకు సుప్రీంకోర్టు సోమవారం ముంబయి మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్‌కు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. “ఆయన ఎక్కడికీ పారిపోలేదు. కాకపోతే ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది” అని ఆయన తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ‘ఆయన మహారాష్ట్ర నేలపై కాలు పెడితే ఆయనకు ముంబయి పోలీసుల నుంచి ముప్పు పొంచి ఉంది” అని కూడా తెలిపారు. పరమ్ బీర్ సింగ్ నాలుగు వసూళ్ల కేసులు ఎదుర్కొంటున్నాడు.
సుప్రీంకోర్టు తన గురువారం విచారణలో ‘ఆయన ఎక్కడ ఉన్నాడు? దేశం బయట ఉన్నాడా? మరో రాష్ట్రంలో ఉన్నాడా? తర్వాతే మిగతా విషయాలు చూస్తాం. మొదట అతడు ఎక్కడ ఉన్నాడో తెలియాలి” అని వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News