Monday, April 29, 2024

వరవరరావు పిటిషన్ పై ఎన్‌ఐఎకు సుప్రీం కోర్టు నోటీసు !

- Advertisement -
- Advertisement -

 

Vara vara Rao

న్యూఢిల్లీ: భీమా కోరేగావ్ కేసు నిందితుడు పి.వరవరరావు వైద్యపరమైన కారణాలతో శాశ్వత బెయిల్‌ను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) నుండి స్పందన కోరింది. జస్టిస్ యు యు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై నోటీసు జారీ చేసి, ఆగస్టు 10 న విచారించనున్నట్లు తెలిపింది. రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. తదుపరి ఆదేశాల వరకు రావుకు మధ్యంతర రక్షణను పొడిగిస్తూ సుప్రీంకోర్టు గతంలో జూలై 12న తీర్పునిచ్చింది.  బాంబే హైకోర్టు ఏప్రిల్ 13న వైద్యపరమైన కారణాలతో శాశ్వత బెయిల్ కోసం తన అభ్యర్థనను తిరస్కరించడాన్ని సవాలు చేసిన 83 ఏళ్ల అతను ప్రస్తుతం వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై ఉన్నాడు,  కాగా అతను జూలై 12న లొంగిపోవాల్సి ఉంది. శాశ్వత బెయిల్ విషయం మంగళవారం విచారణకు వచ్చినప్పుడు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌జి) ఎస్‌వి రాజు ఏదైనా దాఖలు చేయాలనుకుంటే, కోర్టు ఆయనకు సమయం మంజూరు చేస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయంలో ఏదైనా దాఖలు చేసేందుకు తనకు సమయం కావాలని ఎఎస్‌జి ఎస్ వి రాజు కోర్టుకు తెలిపారు. తన రెండు కళ్లలో కంటిశుక్లం కోసం ఆపరేషన్ చేయాల్సి ఉందని, ముంబైలో ఖర్చు ఎక్కువగా ఉన్నందున తాను దానిని చేయించుకోలేదని,  నరాల సమస్యలతో కూడా బాధపడుతున్నానని వరవరరావు తన పిటిషన్‌లో విన్నవించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News