Saturday, April 27, 2024

జూన్ 11న సచిన్ పైలట్ సొంత పార్టీ ప్రకటన?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్‌లో గట్టి ఎదురుదెబ్బ తగలనున్నది. కాంగ్రెస్ అధిష్టానం గత వారం రాజస్థాన్ కాంగ్రెస్‌లో కుదర్చిన రాజీ ఫార్ములా నీరుగారిపోనున్నది. సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు రాజేష్ పైలట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి నాడు జూన్ 11న ప్రగతిశీల్ కాంగ్రెస్ పేరిట సచిన్ పైలట్ కొత్త పార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన పిఎసి సాయంతో కొత్త పార్టీ ఏర్పాటుకు సచిన్ పైలట్ సన్నాహాలు చేస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. రాజస్థాన్‌లో మరి కొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో హనుమాన్ బెనివాల్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ, ఆప్‌తో కలసి తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సచిన్ పైలట్ యోచిస్తున్నట్లు వర్గాలు వెల్లడించాయి.
పైలట్ సొంత పార్టీ పెట్టుకున్న పక్షంలో ఆయన వెంట ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళతారో వేచి చూడాల్సి ఉంది. అదే విధంగా దీని ప్రభావం రాష్ట్రంలో కాంగ్రెస్‌పై ఏమేరకు పడుతుందో కూడా చూడాల్సి ఉంటుంది.

45 సంవత్సరాల సచిన్ పైలట్‌కు అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సచిన్ తనకు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుదని ఆశపడి భంగపడ్డారు. గెహ్లాట్ స్థానంలో పైలట్‌ను కూర్చోపెట్టేందుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా లేకపోవడంతో ఇక వేరు కుంపటే శరణ్యమని సచిన్ భావిస్తున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News