- Advertisement -
హైదరాబాద్:మేడారం జాతరకు దక్షిణ మధ్య రైల్వే(ఎస్ సిఆర్) 20 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లను ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నడపనుంది. హైదరాబాద్-సికింద్రాబాద్-వరంగల్ మధ్య పది రైళ్లను, సిర్పూర్ కాగజ్ నగర్-వరంగల్ మధ్య మరో పది రైళ్లను నడిపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు భక్తుల రద్దీని తగ్గించేందుకు టిఎస్ఆర్ టిసి ఇప్పటికే 500 ప్రత్యేక బస్సులను మేడారం జాతర కోసం సిద్ధం చేసింది.కాగా, 2020 మేడారం జాతరను ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభించి, ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరపనున్నారు.
SCR to run twenty special trains for Medaram Jatara
- Advertisement -