ఓ పోలీస్ కానిస్టేబుల్ తన భార్యతో పాటు ఇద్దరి పిల్లలను హత్య చేసిన సంఘటన జార్ఖండ్ రాజధాని రాంచిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ బ్రిజేష్ తివారి మద్యం మత్తులో తన భార్య, కూతురు, కొడుకును కత్తితో పొడిచి హత్య చేసిన తర్వాత తను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్రిజేష్ విషం తాగే ముందు తన సోదరికి ఫోన్ చేసి తన కుటుంబాన్ని హత్య చేసినట్టు చెప్పాడు. దీంతో ఆమె వెంటనే వారి ఇంటి ఓనర్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి అలర్ట్ చేసింది. అనంతరం ఆమె కూడా ఘటనాస్థలానికి చేరకుంది. ఈలోపే తన భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న బ్రిజేష్ తివారిని చూసిన ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న బ్రిజేష్ ను చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. బ్రిజేష్ తివారి తన కుటుంబంతో కలిసి గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నారని, ఎప్పుడూ కూడా భార్య భర్తలు గొడవపడినట్లు తాను చూడలేదని ఇంటి ఓనర్ పోలీసులకు చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Constable killed his wife and children in Ranchi