Friday, April 26, 2024

మనిషికి మనిషి తోడుండాల్సిన సమయమిది

- Advertisement -
- Advertisement -

Shekhar Kammula

 

కరోనా విపత్కర కాలంలో పారిశుధ్య కార్మికులు ఈ ఎండలలో తమ విధులను నిర్వర్తిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారు. వారికి కృతజ్ఞత చెబుతూ ఒక నెల రోజుల పాటు వెయ్యిమంది పారిశుధ్య కార్మికులకు పాలు, మజ్జిగ అందించేందుకు ముందుకు వచ్చారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిహెచ్‌ఎంసి అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ దర్శకుడు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం కోసం మనం ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల అన్నారు. హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో పనిచేసే వెయ్యిమంది పారిశుధ్య కార్మికులకు నెల రోజుల పాటు ఈ పాలు, మజ్జిగ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జిహెచ్‌ఎంసినే నిర్వహిస్తుంది. వారే తమ సిబ్బందికి ప్రతిరోజూ ఈ పానీయాలు అందేలా చూసుకుంటారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ “పారిశుధ్య కార్మికులు సమాజానికి చేస్తున్న సేవలు అమోఘం.

వారి ఆరోగ్యం గురించి ఆలోచించి దర్శకుడు శేఖర్ కమ్ముల తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. ఈ రోజు కరోనా నివారణకు స్వీయ నియంత్రణ తప్ప మరో మందు లేదు. మన ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు చాలామంది ఇళ్ల నుంచి కదలడం లేదు. ఇక శేఖర్ కమ్ముల వంటి దర్శకులు సమాజానికి సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికుల పట్ల చూపుతున్న ప్రేమకు ధన్యావాదాలు” అని అన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “ నేను మా ప్రాంతంలో ప్రతి రోజూ పారిశుద్ధ్య కార్మికులని చూస్తుంటాను. వారు ఎండలో కష్టపడుతూ ఉంటారు. వారికి థ్యాంక్స్ చెప్పాలనే ఆలోచనతో ఒక వెయ్యి మందికి నెల రోజుల పాటు పాలు, మజ్జిగ అందివ్వాలని నిర్ణయించుకున్నాను. వాటిని మేము పంచడం కంటే వారి సిబ్బంది ద్వారానే అందించగలిగితే వారికి మరింత గౌరవం ఇచ్చినవారమవుతామని ఈ పంపిణీని జిహెచ్‌ఎంసి వారికే అప్పగించాం. ఈ కార్యక్రమంతో మరికొంత మంది వారికి సహాయంగా నిలుస్తారని ఆశిస్తున్నాను. పారిశుద్ధ్య కార్మికులంటే నా దృష్టిలో దేవుళ్ళతో సమానం. వారికి చేసేది కేవలం కృతజ్ఞతతోనే. మనిషికి మనిషి తోడుండాల్సిన సమయమిది”అని పేర్కొన్నారు.

 

Shekhar Kammula help to sanitation workers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News