ఓ మంత్రి రాజీనామా, బిజెపిలోకి ఓ ఎంఎల్ఎ
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. శుక్రవారం ఓ మంత్రి తన పదవికి రాజీనామా చేయగా, ఓ ఎంఎల్ఎ బిజెపిలో చేరనున్నట్టు తెలిపారు. రవాణాశాఖమంత్రి సువేంద్ అధికారి కేబినెట్ నుంచి వైదొలుగుతున్నానని తెలిపారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి పంపారు. ఆ లేఖ ఇ మెయిల్ కాపీని గవర్నర్ జగదీప్ధన్కర్కు పోస్ట్ చేశారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు. అధికారి పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్టు భావిస్తున్నారు. నందిగ్రామ్ నుంచి ఎంఎల్ఎగా ఎన్నికైన అధికారి గురువారమే హుగ్లీ రివర్ బ్రిడ్జి కమిషన్తోపాటు హాల్దియా డెవలప్మెంట్ అథార్టీ చైర్మన్ల పదవులకు రాజీనామా చేశారు. టిఎంసిలో మరో సీనియర్ నేత, కోచ్బిహార్ దక్షిణ్ ఎంఎల్ఎ మిహిర్గోస్వామి పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారు. అధికారి ఐదు జిల్లాల్లోని 35 నియోజకవర్గాల్లో పట్టున్న నేతగా ఆ రాష్ట్ర రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.