Friday, April 26, 2024

సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/రామగిరి: సెంటనరీ కాలనీలోని సింగరేణి క్వార్టర్స్‌లో నివాసముంటున్న గాండ్ల నాగరాజు(35) బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని లద్నాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు సెంటనరీకాలనీలోని క్వార్టర్ నెంబర్ 1509లో నివాసం ఉంటూ ఆర్జీ జీఎం కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులుగా నిర్వర్తిస్తున్నాడు. మృతునికి భార్య మౌనిక ఉంది. వీరికి 2017లో వివాహం జరిగింది. ఆమె కూడా జీఎం కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తుంది. బుధవారం ఉదయం మృతుని భార్య విధుల్లోకి వెళ్లిన తర్వాత క్వార్టర్‌లో ఒంటరిగా ఉన్న నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు.

Singareni Employee suicide in Karimnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News