- Advertisement -
ఎక్మో, వెంటిలేర్ సాయంతో చికిత్స
కోలుకుంటున్న దశలో ఆరోగ్య
పరిస్థితి తారుమారు నిపుణులైన వైద్య
బృందం పర్యవేక్షిస్తోంది చెన్నై ఎంజిఎం
ఆసుపత్రి వర్గాల ప్రకటన
ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆయనకు చికిత్సనందిస్తున్న చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రి వెల్లడించింది. గురువారం సాయత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆయనకు ఎక్మో, వెంటిలేర్తో పాటు ఇతర ప్రాణాధార చికిత్సనందిస్తున్నాం. ఎస్.పి.బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని ఎంజిఎం ఆసుపత్రి వర్గాల వారు వెల్లడించారు. ఎస్.పి.బాలసుబ్రమణ్యంకు కరోనా సోకడంతో ఆగస్ట్ 5న ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. ఆతర్వాత కరోనా నెగటివ్ వచ్చినా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం క్షీణించింది
- Advertisement -