Saturday, April 27, 2024

నిద్రలో ఉన్న పసిపాపను కాటేసిన పాము

- Advertisement -
- Advertisement -

Snake bite baby

మహబూబాబాద్: పాము కాటుతో పరుపులో పడుకున్న పసిపాప మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… క్రాంతి-మమత అనే దంపతులకు మూడు నెలల పాప ఉంది. పసిపాపకు ఆరోగ్యం బాగోలేకపోడంతో ఆస్పత్రి నుంచి తీసుకొచ్చి ఇంట్లో పరుపుపై పడుకోబెట్టారు. అప్పుడే పాలు తాగిన పాప బిగ్గరగా ఏడ్వడంతో స్థానికంగా ఉన్న వైద్యుడికి చూపించారు. వెంటనే పాము అక్కడి నుంచి కిందపడడంతో క్రాంతి పామును ఎడమకాలుతో తొక్కడంతో అతడిని కాటేసింది. స్థానికులు పామును కర్రలతో కొట్టి చంపేశారు. దీంతో అతడిని పాము కాటువేయడంతో ఇద్దరిని 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పాప చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. క్రాంతికి వికటించే ఇంజక్షన్ వైద్యులు ఇచ్చారు. పాపకు ఎడమ తుంటి భాగంలో పాము కాటు వేసినట్లుగా వైద్యులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News