Saturday, April 27, 2024

మిలిటెంట్ల టూల్‌కిట్‌లో కీలక ఆయుధంగా సోషల్ మీడియా

- Advertisement -
- Advertisement -

Social media potent instrument in terrorists toolkit

ఐరాస భద్రతామండలి సమావేశంలో భారత్ వెల్లడి

న్యూఢిల్లీ : మానవాళికి ఉగ్రవాద ముప్పు పెరుగుతోందని, ఇది మరింత విస్తరిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన కౌంటర్ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ సమాజాన్ని అస్థిరపరిచే లక్షంతో కుట్ర సిద్ధాంతాలను వ్యాప్తి చేయడంలో ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు మిలిటెంట్ గ్రూప్‌ల టూల్‌కిట్‌లో శక్తివంతమైన సాధానాలుగా మారాయి. కొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త సవాళ్లను విసురుతోంది. ఉగ్రముప్పును ఎదుర్కోడానికి సమితి భద్రతామండలి తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఉగ్రవాదం విస్తృతమవుతోంది. ఆసియా, ఆఫ్రికాలో ఈ పరిస్థితి తీవ్రమవుతోంది. ఉగ్రవాద నిరోధక ఆంక్షలు రూపొందించడంలో , ఉగ్రసంస్థలకు నిధులు అందించే దేశాలను నోటీసులో ఉంచడంలో మండలి కీలకంగా వ్యవహరించింది” అని అన్నారు. భారత్‌లో జరుగుతోన్న ఈ కౌంటర్ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశాల్లో ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

పాక్ గ్రేలిస్టులో ఉండగా దాడులు తగ్గాయి : భారత్
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఎటిఎఫ్) గ్రే లిస్ట్ వల్లే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు తగ్గిపోయాయని పాక్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ భారత్ ఈ సమావేశంలో వెల్లడించింది. ఈ పరస్పర సంబంధాన్ని ఈ కమిటీ పరిశీలించాలని కోరింది. ఇటీవల గ్రే లిస్ట్ నుంచి పాక్‌ను ఎఫ్‌ఎటిఎఫ్ తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి , ప్రపంచ బ్యాంకు , ఏడీబీ, యూరోపియన్ యూనియన్ తదితర సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం పాకిస్థాన్‌కు ఏర్పడింది. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడి చేసే లక్షాలను పాక్ అందుకోకపోవడం వల్ల ఎఫ్‌ఏటీఎఫ్ నాలుగేళ్ల పాటు ఆ దేశాన్ని గ్రేలిస్ట్‌లో ఉంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News