- Advertisement -
సాయితేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సుబ్బు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ చిత్రాన్ని జీ స్టూడియో అసోసియేషన్తో విడుదల చేస్తున్నారు. నభా నటేశ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో సాయితేజ్ మాట్లాడుతూ “క్రిస్మస్కు ప్రేక్షకులను అలరించడానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో రాబోతున్నాం. అన్ని ఎమోషన్స్ ఉన్న ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ఇది”అని అన్నారు. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ “డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. మా సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాం”అని తెలిపారు.
- Advertisement -