- Advertisement -
ముంబయి: కరోనా కారణంగా ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్)ఎనిమిదో సీజన్ వాయిదా పడింది. అధికారుల గైడ్లైన్స్, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు లీగ్ నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.‘ పికెఎల్ 8వ సీజన్ వాయిదా పడిందని తెలియజేయడానికి మేము చింతిస్తున్నాం. తిరిగి ప్రారంభం కావడానికి సురక్షితం కాగానే వచ్చే ఏడాది తిరిగి వస్తాం’ అని ఆ ప్రకటన తెలిపింది. కాగా స్టార్ స్పోర్ట్లతో కుదుర్చుకున్న అయిదేళ్ల కాలపరిమితి గత ఏడాది ముగిసినందున ఈ ఏడాది పికెఎల్కు కొత్త బ్రాడ్కాస్ట్ భాగస్వామి ఉండవచ్చని ఇంతకు ముందు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే కరోనా కారణంగా వచ్చే ఏడాది లీగ్కు మీడియా హక్కుల వేలంను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్వాహకులు భావించారు.
- Advertisement -