Saturday, April 27, 2024

పెద్దపల్లిలో దారుణం.. వృద్ధ తల్లిదండ్రులపై కొడుకు దాడి

- Advertisement -
- Advertisement -

సుల్లానాబాద్: పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ లో బుధవారం దారుణం చోటుచేసుకుంది. వృద్ధ తల్లిదండ్రులపై కుమారుడు కర్రతో దాడి చేశాడు. కుటంబ కలహాలతో తల్లిదండ్రులను కొడుకు తీవ్రంగా కొట్టాడు. తీవ్రంగా గాయపరిచిన అనంతరం కుమారుడు పరారైయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వృద్ధులను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తుకు బానిసై తల్లిదండ్రులపై దాడి చేసినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News