Thursday, May 16, 2024

సూరీడుపై దాడి చేసిన అల్లుడు

- Advertisement -
- Advertisement -

Son in law attack on suridu in Jublihills

 

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పిఎగా పని చేసిన సురీడుపై అల్లుడు దాడి చేశాడు. సురీడు కూతురు గంగ భవానీ భర్త సురేంద్ర నాథ్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లోకి ప్రవేశించి ఆయనపై బ్యాట్‌తో దాడి చేశాడు. భార్యను సురేంద్రనాథ్ వేధింపులకు గురిచేస్తుండడంతో అతడిపై గృహ హింస కేసు నమోదు చేశారు. ఈ కేసును ఉపసంహరించుకోవాలని సురీడుపై సురేంద్ర నాథ్ ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికి పట్టించుకోలేదు. దీంతో మామను హత్య చేసేందుకు బ్యాట్ తీసుకొని వచ్చి అతడిపై దాడి చేశాడు. సురీడు కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సురేంద్ర నాథ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News