Monday, April 29, 2024

రూ.50 ఇవ్వ‌లేద‌ని.. తండ్రిని చంపిన కొడుకు

- Advertisement -
- Advertisement -

Son killed father with knife in Delhi

న్యూఢిల్లీ: ‌దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. రూ .50 ఇవ్వ‌లేద‌నే కోపంతో 70 ఏళ్ల తండ్రిని కొడుకు కత్తితో పొడిచి పారిపోయాడు. స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. బాధితుడిని మహేంద్రపాల్ గా గుర్తించారు. ఈ సంఘ‌ట‌న ఢిల్లీలోని భ‌ర‌త్ న‌గ‌ర్ లో గురువారం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… నిరుద్యోగి అయిన కొడుకు అనిల్ నిత్యం డ‌బ్బులు ఇవ్వాల‌ని తండ్రి హింసించేవాడు. ఈ నేపథ్యంలోనే రూ. 50 ఇవ్వాల‌ని తండ్రిని అడిగాడు. తండ్రి నిరాక‌రించ‌డంతో ఛాతీపై క‌త్తితో పోడిచాడు. ఉద్యోగం చూసుకోవాల‌ని తండ్రి కొడుకుకు చెప్పడంతో ఆవేశంతో క‌త్తితో దాడి చేశాడని అనిల్ త‌ల్లి పోలీసులకు తెలిపింది. కొడుకును వారించేందుకు ప్ర‌య‌త్నించిన త‌న‌పై కూడా దాడి చేశాడని ఆమె పేర్కొంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని నిందితుడి అరెస్ట్ చేశామన్నారు. ఈ హత్య ఆవేశంలో జరిగిందని పోలీసులు నిర్ధారించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News