- Advertisement -
కోల్కతా: భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంటిలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టించింది. తాజాగా, గంగూలీ కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా సోకింది. గంగూలీ సోదరుడు, మాజీ రంజీ ఆటగాడు స్నేహశిష్కు, అతని భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న స్నేహశిష్కు వైద్య పరీక్షలు చేయగా కరోనా ఉన్నట్టు తేలింది. అంతేగాక అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మరోవైపు స్నేహశిష్ ఇంటిలో పని చేసే వ్యక్తికి కూడా కరోనా ఉన్నట్టు వెల్లడైంది. ఇదిలావుండగా స్నేహశిష్ అత్తమామలు కూడా కరోనా బారిన పడ్డారు. వీరికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో గంగూలీ కుటుంబంలో ఆందోళన మొదలైంది.
Sourav Ganguly’s Brother test positive for Covid 19
- Advertisement -