- Advertisement -
చెన్నై: తమిళనాడులో మహమ్మారి కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఏకంగా 2,396 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో 38 మంది మరణించారని తమిళనాడు ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 56,845కు చేరింది. ఇక, కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 704కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 23,512 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి కోలుకుని 31,316 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.
2396 New Corona Cases Reported in Tamil Nadu
- Advertisement -