న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 2115, 2114తో కెనడాకు చెందిన జేసన్ ఆంథోనీపై విజయం సాధించాడు. ఆరంభం నుంచే శ్రీకాంత్ దూకుడును ప్రదర్శించాడు. చక్కటి షాట్లతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. శ్రీకాంత్ ధాటికి ఆంథోనీ కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీకాంత్ ఏ మాత్రం ప్రతిఘటన లేకుండానే తొలి గేమ్ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా శ్రీకాంత్ జోరును కొనసాగించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అలవోకగా సెట్ను గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను సాధించాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ రెండో సీడ్ చౌటిన్ చెన్తో తలపడుతాడు.
Srikanth reaches Denmark Open 2020 Quarter final