Tuesday, April 30, 2024

ఈవిఎం వీఇ ప్యాట్ల భద్రతకు పటిష్ట చర్యలు

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: ఎన్నికల నిర్వాహణ కోసం ఉపయోగించే ఈవిఎం ప్యాట్ల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఈవిఎం గోడౌన్స్‌ను అదనపు కలెక్టర్ రాజేశం, అర్‌డిఓ రాజేశ్వర్‌తో కలిసి వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవిఎంలు తనిఖి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవిఎం, వివి ప్యాట్ల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈవీఎంలను ఎప్పటికప్పుడు తనిఖి చేయడం జరుగుతుందని అన్నా రు. రానున్న వారం రోజుల పాటు పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల పనితీరు పరిశీలించారు.

ఈవిఎంల బ్యాటరీలను మార్చి వాటిని సిద్ధ్దం చేయాలని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఈవిఎంలు సిద్ధంగా ఉండేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, సంబంధిత శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News