- Advertisement -
రంగారెడ్డి: హయత్ నగర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శంకరయ్య కుమారుడు సాయి తరుణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మధ్యనే విదేశాలకు వెళ్లి వచ్చిన తరుణ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తరుణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sub Inspector’s Son Attempt Suicide in Hayathnagar
- Advertisement -